నెలన్నర క్రితం మృతి చెందిన బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ రాజ్ పూత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా ఓటీటీ ద్వారా డైరెక్ట్ గా రిలీజ్ అయ్యింది.డిస్నీ హాట్ స్టార్లో ప్రతి ఒక్కరు చూసే విధంగా ఈ సినిమాను ఉచితంగా స్ట్రీమింగ్ కు ఉంచారు.
సినిమా కోసం ఎంతగానో ఎదురు చూసిన ప్రేక్షకులు ఎట్టకేలకు స్ట్రీమింగ్ మొదలు పెట్టడంతో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
సుశాంత్ నటన చాలా నాచురల్గా ఉండటంతో పాటు నిజ జీవితంకు అందులోని సుశాంత్ పాత్ర కనెక్ట్ అయ్యి ఉండటంతో ప్రేక్షకులు ఎమోషనల్ అయ్యే విధంగా ఉంది.
తెలుగులో వచ్చిన గీతాంజలి సినిమాను పోలి ఉన్నప్పటికి వైవిధ్యభరిత కథనంతో సినిమాను తెరకెక్కించారు.
హీరోయిన్ కు క్యాన్సర్, ఆమె బోరింగ్ లైఫ్ లో ఎంటర్ అయిన హీరో ఆమెను ఎలా ఎంటర్ టైన్ చేస్తాడు చివరకు ఏం జరుగుతుంది అనేది సినిమా కథాంశం.అద్బుతమైన స్క్రీన్ప్లేతో పాటు ఎమోషనల్ సీన్స్తో సాదారణ ప్రేక్షకులను కూడా కట్టి పడేసే విధంగా ఉంది.
సుశాంత్ చివరి చిత్రం అయిన ఇది అతడికి మంచి నివాళిగా ప్రేక్షకులు చెబుతున్నారు.
సినిమాలోని కొన్ని సీన్స్ సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రియల్ సంఘటనలకు కనెక్ట్ అయ్యాయి.
చనిపోయే సమయంలో అతడి మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో కొన్ని సీన్స్ను బట్టి అర్థం చేసుకోవచ్చు.కెరీర్ బెస్ట్ నటనను సుశాంత్ ఇందులో చూపించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంత మంచి నటన ప్రతిభ కలిగి ఉండి, అభిమానులను సొంతం చేసుకున్న సుశాంత్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడంటూ మరోసారి ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.