బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ పుత్ అర్ధాంతరంగా ఉరి వేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే.ముంబై లోని ఆయన నివాసంలోనే ఫ్యాన్ కు ఉరివేసుకొని మృతి చెందడం అందరినీ కలచివేసింది.
ఎంతో సుదీర్ఘ సినీ భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఇలా అర్ధాంతరంగా మృతి చెందడం అందరినీ కూడా దిగ్బ్రాంతికి గురిచేసింది.అయితే ఆయన గత ఆరు నెలలుగా డిప్రెషన్ లో ఉంటున్నారని అందుకే క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు అని భావిస్తుండగా అసలు సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటూ జన్ అధికార పార్టీ చీఫ్ పప్పూ యాదవ్ ఆరోపిస్తున్నారు.
పాట్నా లోని సుశాంత్ ఇంటికి వెళ్లిన పప్పూ యాదవ్ మీడియా తో మాట్లాడుతూ ఇలాంటి ఆరోపణలు చేశారు.అసలు ఆయన ఆత్మహత్య చేసుకొనే వ్యక్తి కాదని,ఆయన మరణం వెనుక ఎదో ఉంది అంటూ ఆయన ఆరోపించారు.
సుశాంత్ మరణం కేసులో సీబీఐ విచారణ చేపట్టాలంటూ పప్పూ యాదవ్ డిమాండ్ చేశారు.మరోపక్క సుశాంత్ కుటుంబ సభ్యులు సైతం అతడి మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సుశాంత్ సూసైడ్ చేసుకున్నట్లు మేం భావించడం లేదని ఆ హీరో బాబాయ్ తెలిపారు.
సుశాంత్ మరణం వెనుక ఏదో మిస్టరీ ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
మా వాడిని మర్డర్ చేశారంటూ ఆయన కూడా ఆరోపిస్తున్నారు.అయితే బాలీవుడ్ లో చాలా సెలెక్టెడ్ గా మూవీస్ చేస్తూ అతికొద్ది చిత్రాలతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలచివేస్తుంది.
అతడి మరణాన్ని ఎవరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.ఎంఎస్ ధోనీ, చిచ్చోరే, కేదార్నాథ్, సోంచిడియా లాంటి ఫేమస్ చిత్రాల్లో సుశాంత్ హీరో పాత్ర పోషించి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే.
అయితే అతడి మృతి వెనుక డిప్రెషన్ కారణమా లేదంటే మరేదైనా మిస్టరీ ఉందా అన్న విషయం మాత్రం అర్ధం కావడం లేదు.