మన భారత్ లో జరిగే కొన్ని కొన్ని ఘటనలు చూస్తే అనిపిస్తుంది.నిజంగా మనుషులు ఇలా కూడా చేస్తారా? ఇన్ని సాహసాలు చేస్తారా? అని.ఇప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు కదా! అక్కడికే వస్తున్న.సుశాంత్ నంద ఓ వీడియో ను షేర్ చేశాడు.
ఆ వీడియో చూస్తే వామ్మో అనకుండా ఉండలేరు.అలా ఉంది ఆ వీడియో.
ఎందుకంటే? ఓ చిన్న ట్రాక్టర్ వెనుక భాగంలో ఓ పెద్ద మిషన్ పెట్టారు.ఆ మిషన్ పెట్టడం వల్ల ముందు భాగం పైకి లేస్తుంది.
దీంతో ఆ ట్రాక్టర్ ముందు భాగంపై నలుగురిని నిలబెట్టారు.ఇంకా వెనుక అది పడిపోకుండా దాన్ని తాడుతో కట్టి ముందుకు లాగుతున్నారు.
ఇది అంత ఒక ఎత్తు అయితే.
ఆ ట్రాక్టర్ ని రోడ్డుపై కాకుండా మెట్లపై పొనిస్తున్నారు.
ఒకటి రెండు కాదు ఏకంగా 26 మెట్లపై లాగలేక లాగలేక ఆ ట్రాక్టర్ తో పొనిస్తున్నారు.నిజానికి ఆ మెట్ల పక్కన కూడా ఏమి లేదు.
చుట్టూ కొండలు.పట్టు తప్పింది అంటే పదిమందికిపైగా మనుషులు లోయలోకి పడిపోతారు.
అలాంటి డేంజర్స్ వీడియోను సుశాంత్ నంద ట్విట్టర్ లో షేర్ చేస్తూ.ఇలాంటి ఘటనలు కేవలం ఇండియాలోనే జరుగుతాయి అంటూ షేర్ చేశాడు.
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.