బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా చాలా మందిపై ప్రభావం చూపుతోంది.ముఖ్యంగా స్టార్ వారసులపై ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది.
వారి సినిమాలను నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.దాంతో వారి సినిమాలు ఇప్పుడు విడుదల అయితే ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
నెపొటిజం వల్లే సుశాంత్ చనిపోయడు అంటూ నమ్ముతున్న కొందరు బాలీవుడ్ కు చెందిన వారసులను టార్గెట్ చేశారు.ఆలియా భట్ నుండి మొదలుకుని అనన్య పాండే వరకు ట్రోల్స్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ ప్రభావం విజయ్ దేవరకొండ హీరోగా పూరి దర్శకత్వంలో సినిమాపై కూడా ఉంటుందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది.విజయ్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో అనన్య పాండే నటిస్తోంది.
బాలీవుడ్ లో ఈమధ్య పరిచయం అయిన ఈమె చుంకీ పాండే కూతురు.ఈమెను కరణ్ జోహార్ ప్రోత్సహిస్తున్నాడు.
ఇదే సమయంలో సినిమాకు ఒక నిర్మాతగా కరణ్ జోహార్ ఉన్నాడు.దాంతో సినిమాను ఉత్తరాదిన విడుదల చేస్తే దారుణంగా ట్రోల్ చేయడం ఖాయం అనిపిస్తుంది.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు.కాని ఇప్పుడున్న పరిస్థితిలో అయ్యేనా అనేది అనుమానంగా ఉంది.రౌడీ స్టార్ సినిమాకు ఇప్పుడు అనన్య పాండే మరియు కరణ్ జోహార్లు సమస్యగా మారారు.వారి వల్లే బాలీవుడ్ లో మంచి బిజినెస్ ఉంటుందని అనుకుంటే సుశాంత్ మరణం తర్వాత సీన్ రివర్స్ అయ్యి వారే సినిమాకు మైనస్ అయ్యే పరిస్థితి వచ్చింది అంటున్నారు.
అయితే విజయ్, పూరిల మూవీ ప్రారంభంకు ఇంకా చాలా సమయం ఉంది.కనుక అప్పటి వరకు సుశాంత్ వ్యవహారం సర్దుమనిగే అవకాశం ఉందంటున్నారు.చూడాలి విజయ్ కి సుశాంత్ దెబ్బ ఎంతలా ఉంటుందో.!
.