అక్కినేని మేనల్లుడుగా టాలీవుడ్ కి పరిచయం అయిన హీరో సుశాంత్.నటుడుగా ఒకే అనిపించుకున్న కమర్షియల్ హీరోగా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.
తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలు కాకుండా మాస్ ఇమేజ్ కోసం హీరోయిక్ సినిమాలు చేయడం వలన కెరియర్ లో ఎక్కువ ఫ్లాప్ లు వచ్చాయి.తర్వాత కాస్తా జోనర్ మార్చి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఛి.ల.సౌ అనే సినిమా చేశాడు.ఇది డీసెంట్ హిట్ గా నిలిచి అతని ఇమేజ్ ని కూడా మార్చింది.తాజాగా అల వైకుంఠపురంలో సినిమాలో ఓ పాత్రలో నటించాడు.ఆ పాత్ర కోసం త్రివిక్రమ్ సుశాంత్ ని ఎందుకు తీసుకున్నాడో సినిమా చూసిన వాళ్ళకి కూడా అర్ధం కాలేదు.
సినిమా మొత్తం కనిపించిన సరిగ్గా పది డైలాగ్ లు కూడా లేవు.
ఓ విధంగా నిలబడటానికి తప్ప నటించడానికి ఎలాంటి స్కోప్ లేని పాత్రగా అది మిలిగిపోయింది.ఇక నుంచి తనకి సరిపోయే కథలతోనే ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయిన సుశాంత్ అందులో భాగంగానే ఇచ్చట వాహములు నిలుపరాదు అనే సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సుశాంత్ మరో క్రేజీ ఆఫర్ ని సొంతం చేసుకున్నాడు.తెలుగులో స్ప్రైట్ సాఫ్ట్ డ్రింక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు.తెలుగులో అతి కొద్ది మంది మాత్రమే శీతల పానియాలకి బ్రాండ్ అంబాసిడర్ గా చేసే అవకాశం సొంతం చేసుకున్నారు.ఇప్పుడు ఆ కోవలో సుశాంత్ కూడా చేరడం విశేషం.
దీనికి సంబందించిన యాడ్ వీడియో టెలివిజన్ లో కూడా ప్రసారం అవుతుంది.