బాలీవుడ్ లో చాలా కాలంగా నెపోటిజం గొడవ నడుస్తుంది.సుశాంత్ మరణం తర్వాత ఈ గొడవ మరింత తారాస్థాయికి చేరుకుంది.
ఎన్నో కలలతో హీరోయిన్స్ అవుదామని, హీరోలు అవుదామని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకపోవడానికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బంధుప్రీతి, నెపోటిజం కారణం అని చాలా మంది సెలబ్రిటీ ప్రముఖులు ఆరోపణలు చేస్తున్నారు.కంగనా లాంటి వారు ఈ విషయంలో మరో రెండు అడుగుల ముందుకి వేసి నెపోటిజంకి వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతుంది.
అయితే సెలబ్రిటీ కుటుంబాల నుంచి హీరోలుగా, హీరోయిన్స్ గా బాలీవుడ్ లో సక్సెస్ అయిన వారు ఈ నెపోటిజం ఆరోపణలపై పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదు.అయితే తాజాగా కరీనా కపూర్ మాత్రం నెపోటిజం వాఖ్యలు తనని ఎంతగా బాదిస్తున్నాయో అనే విషయాన్ని ఆమె మాటల ద్వారా బయట పెట్టింది.
కపూర్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలో హీరోయిన్ అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా కరీనా కపూర్ ఎదిగింది.అయితే తాను కేవలం నెపోటిజంతోనే ఎదగలేదని, తన స్వశక్తితో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.మనం సిచ్యుయేషన్ ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించం.ఒక ప్రత్యేకమైన బ్యాగ్రౌండ్ నుండి వచ్చినవారైతే చాలు దాడి చేయాలి అనేదానికి చాలా మంది అలవాటు పడ్డారు.
అయితే బ్యాగౌండ్ వల్లే ఈ పేరు కీర్తి డబ్బు సక్సెస్ వచ్చాయని అనడం కరెక్ట్ కాదు.నిజాయితీగా చెప్పాలంటే నేను 21 సంవత్సరాల నా కెరీర్ కు నెపోటిజం మాత్రమే కారణం కాదు.
అది అసలు సాధ్యం కూడా కాదు.ఇండస్ట్రీలో చాలామంది సూపర్ స్టార్స్ వారసత్వంగా వచ్చిన వారు స్టార్స్ గా నిలబడలేదు.
డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలని కోరుకుంటాడు.అది వారి ఆలోచన.
అయితే దాని మీద ఎవరూ డిస్కషన్ చేయరు.బాలీవుడ్ అనేది పెద్ద ఇండస్ట్రీ కాబట్టి అందరూ దీని వైపు చూస్తారు అని చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో నేను కూడా స్ట్రగుల్ అయ్యాను.కానీ నా స్ట్రగుల్ 10 రూపాయలు జేబులో పెట్టుకొని ట్రైన్ ఎక్కి వచ్చివారిలా ఉండదు.
నాకే కాదు స్టార్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు కూడా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఇబ్బందులు పడుతూ ఉండాలి అని కరీనా తన మనసులోని మాటని బయటపెట్టింది.