బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడటంతో ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ తన ఫ్లాట్లో ఉరివేసుకుని మృతి చెందాడు.
కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన చివరి సినిమా ‘దిల్ బిచారా’ రిలీజ్కు రెడీ అయ్యింది.ప్రస్తుతం థియేటర్స్ మూతపడటంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు.కాగా ఈ సినిమా ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.ఈ ట్రైలర్ చూస్తే సుశాంత్ ఫ్యాన్స్ కంటనీరు పెట్టడం ఖాయం.చాలా ఫీల్ గుడ్ చిత్రంగా ‘దిల్ బిచారా’ తెరకెక్కడంతో సుశాంత్ ఫ్యాన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు.ఇక ఈ ట్రైలర్ను చూస్తున్నంతసేపు సుశాంత్ సింగ్ను చూస్తూ ఉండిపావడం ఖాయం.
అటు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా ఈ ట్రైలర్కు బాగా ప్లస్ పాయింట్ అయ్యింది.
ఇక ఈ ట్రైలర్లో సుశాంత్ చెప్పే ఓ డైలాగ్ మనస్సుకు తగులుతుంది.
‘ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు చావాలో మనం డిసైడ్ చేయలేం’ అనే డైలాగు సుశాంత్ చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.సినిమాలో చెప్పిన డైలాగును ఆయన నిజజీవితంలో ఆచరించలేకపోయాడని పలువురు ఫీల్ అవుతున్నారు.
ఇక ఈ సినిమాను డిస్నీ హాట్స్టార్ ఓటీటీలో అతి త్వరలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.