బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసును సిబిఐ వారు ఎంక్వైరీ చేస్తున్న విషయం తెలిసిందే.కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కేసుని వారికి అప్పగించారు.
ఈ కేసులో రియా చక్రవర్తితో పాటు ఇంకా పలువురు ని ఎంక్వైరీ చేసిన సిబిఐ వారు ఎట్టకేలకు కేసు విచారణను తుది దశకు తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇన్ని రోజులు వాళ్లు విచారించిన దాని ప్రకారం చూస్తే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం వల్లే మృతి చెందినట్లుగా నిర్థారణ అయ్యిందట.
సుశాంత్ మృతి వెనుక ఎలాంటి కుట్ర కోణం లేదంటూ వారు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం విచారణ తుది దశలో ఉందని సిబిఐ వర్గాల నుండి సమాచారం అందుతోంది.
ఇటీవల ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ ఆసుపత్రి వర్గాల వారు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు.
ఆసుపత్రి వర్గాల వారు ఇచ్చిన రిపోర్ట్ ను ఆధారంగా చేసుకుని సిబిఐ వారు ఈ కేసు విషయంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు సిబిఐ వారు చాలా స్పీడ్ గా ఎంక్వయిరీ చేసి తుది రిపోర్టును తయారు చేయబోతున్నారు.ఇందులో ఎవరు దోషులు అనే విషయంలో వారు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చారట.
రియా చక్రవర్తి కి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేనట్లుగా వారు భావిస్తున్నారు.ఆమె సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేసిన మాట వాస్తవమే కాని ఆయన ఆత్మహత్య కు ఆమెకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వారు నిర్థారణకు వచ్చారట.
డ్రగ్స్ అలవాటు ఉండడం వల్ల సుశాంత్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు నిర్ధారణకు వచ్చారు. బాలీవుడ్ ప్రముఖుల పేర్లు కూడా వచ్చిన నేపథ్యంలో వారు ఎవ్వరు కూడా ఈ కేసులో లేరంటూ సిబిఐ ఎంక్వైరీ లో వెల్లడైంది.
దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.