సుశాంత్ సింగ్ రాజపుత్… అన్ని బాగుంటే బాలీవుడ్ ఒక స్టార్ హీరో అయ్యేవాడు.కానీ బంధుప్రీతి అనే రాక్షసత్వం సుశాంత్ సింగ్ ని చంపేసింది.
ఇక ఈ నేపథ్యంలోనే సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం వెనుక రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్.
ఇక ఈ నేపథ్యంలోనే సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఇప్పటికే రియా సోదరుడు షోవిక్ ని, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిందాలను అరెస్ట్ చేశారు.
అయితే ఈ కేసులో ఇప్పుడు మరొకరిని అరెస్ట్ చేశారు.సుశాంత్ ఇంట్లో పనిచేసిన వంటవాడు దీపేష్ సావంత్ను ఎన్సీబీ అరెస్ట్ చేసింది.
ఇక ఈ కేసుకు హాజరైన సావంత్ ఇవాళ విచారణకు హాజరు కాగా అతడి వద్ద నుంచి పలు సంచలన విషయాలను రాబట్టారు.డ్రగ్స్ కేసులో దీపేష్ ప్రమేయం ఉందని నిర్ధారణకు వచ్చిన ఎన్సీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు.
ఇక అతన్ని ఈరోజు ఉదయం 11 గంటలకు ఎస్పాన్లెట్ కోర్ట్ ముందు హాజరుపరచనున్నారు. కాగా సుశాంత్ సింగ్ రాజపుత్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది.
ఇప్పటికే ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి రాగా ఇప్పుడు ఈ డ్రగ్స్ స్టోరీ బాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.కాగా సుశాంత్ సింగ్ రాజపుత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకొని మరణించి ఎంతోమంది అభిమానులకు తీరాని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే.