బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి ఎంతగా కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే.అయితే తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆయన మాజీ సిబ్బంది అంకిత్ ఆచార్య సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇందులో భాగంగా పోలీసుల విచారణలో పాల్గొన్న టువంటి అంకిత్ ఆచార్య సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం తనకు సుశాంత్ ఫోటోలను చూడగా పలు అనుమానాలు కలిగాయని పోలీసులకు తెలిపాడు. అంతేగాక సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో మెడపై ఉన్నటువంటి గాయాలను చూస్తే సుశాంత్ ని తన పెంపుడు కుక్క ఫడ్జ్ మెడకు కట్టే బెల్టుతో అతడిని ఉరేసి చంపినట్లు పలు అనుమానాలు వ్యక్తం చేశాడు.
అంతేగాక రియా చక్రవర్తి కూడా సుశాంత్ ఆత్మహత్య అనంతరం అకారణంగా కొంతమంది సిబ్బందిని తీసేసిందిని చెప్పుకొచ్చాడు.
దీంతో పోలీసులు సుశాంత్ ఆత్మహత్య కేసు ని వివిధ కోణాలలో విచారిస్తున్నారు.
అంతేకాక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సన్నిహితంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.మరోవైపు సుశాంత్ అభిమానులు మాత్రం నిజానిజాలేమిటో బయట పెట్టాలంటూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పోలీసులను కోరుతున్నారు.