సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ డెత్ కేసు ఇప్పుడు ఎంత వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసు విచారిస్తుండగా డ్రగ్స్ విషయం బయటపడటం.
దాని వల్ల ఒకోకరు బయటకు రావడం జరిగిన సంగతి తెలిసిందే.అయితే డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురిని ఎన్సీబీ అరెస్ట్ చేసింది.
ఇక త్వరలోనే మరికొందరికి సమన్లు పంపే ఆలోచనలో ఎన్సీబీ అధికారులు ఉన్నారు. అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారిని ఎన్సీబీ అధికారులు పలు విధాలుగా విచారిస్తున్నారు.
ఇక అలానే సుశాంత్ సింగ్ రాజపుత్ టాలెంట్ మేనేజర్ జయా సాహానిని రెండు రోజు పాటు విచారణ జరపగా అందులో ఆమె కొన్ని కీలక విషయాలను వెల్లడించింది.అది విన్న అధికారులు అందరూ ఆశ్చర్యానికి గురవ్వడమే కాకుండా షాక్ అవుతున్నారు. అది ఏంటి అంటే.సుశాంత్ సింగ్ రాజపుత్ కి ఆమె 2017 నుంచి టాలెంట్ మేనేజర్గా పని చేసినట్టు చెప్పిన ఆమె సన్చురియా, కేదార్నాథ్, చిచ్చోరే, డ్రైవ్ వంటి సినిమాల అవకాశాలు సుశాంత్ కు వచ్చేలా చేసిందని చెప్పింది.
అయితే సన్చురియా, చిచ్చోరే సినిమాకు 5 కోట్ల రూపాయిలు తీసుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేదార్నాథ్ సినిమాకు 6 కోట్ల రూపాయిలు తీసుకున్నట్టు తెలిపింది. ఇక అలానే కుమార్ మంగళ్ తెరకెక్కించనున్న ఓ సినిమా కథ విన్న సుశాంత్ సింగ్ రాజపుత్ మార్చి నెలలో 6 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కు ఒప్పుకోగా జూన్ నెలలో 12 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశాడని ఆమె ఎన్సీబీ అధికారులకు తెలిపింది.
సుశాంత్ సింగ్ రాజపుత్ ఇంటికి వెళ్ళినప్పుడు సుశాంత్ సింగ్ రాజపుత్ చాలా విచిత్రంగా ప్రవర్తించినట్టు ఆమె తెలిపారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది.