సూర్యాపేట మున్సిపాలిటీ కేంద్రంలోని దురాజ్ పల్లి లో మొదలైన జాతర.కాగా తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతరగా చెప్పబడే పెద్దగట్టు జాతర యాదవుల ఆట పాటలతో మొదలవుతుందట.
ఇక్కడ యాదవులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ జాతరకి, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పెద్దగట్టుకు తరలిరావడం విశేషం.
అదీగాక తెలంగాణలో మేడారం తరువాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు జాతర గుర్తింపు పొందిందట.
ఇకపోతే నేటి నుంచి ఈ జాతర మొదలైన నేపథ్యంలో, హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలను దారి మళ్లించారు.ఈ క్రమంలో సూర్యాపేట మీదుగా మరో ఐదు రోజుల పాటు వాహనాలను అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.
ఈ జాతర ముగిసే వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారు, నార్కట్ పల్లి, అద్దంకి రహదారి మీదుగా మిర్యాలగూడ చేరుకుని, అక్కడి నుంచి హుజూర్ నగర్, కోదాడ మీదుగా ప్రయాణించాల్సి వుంటుందని అధికారులు స్పష్టం చేశారు.కాగా, ఐదు రోజుల పాటు సాగనున్న ఈ జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారట.