24 హిట్ తో సూపర్ ఫాంలో ఉన్న సూర్య ఇప్పుడు మరోసారి తనలోని ఉగ్ర నరసింహా రూపాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.సింగంగా ఆల్రెడీ రెండు సినిమాలతో సూపర్ హిట్ దక్కించుకున్న సూర్య ఇప్పుడు సింగం త్రీ ఎస్-3గా రాబోతున్నాడు.
ముందు రెండు సినిమాల కన్నా ఈ సినిమా మరింత పవర్ ఫుల్ గా ఉంటుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.అయితే తెలుగులో దసరా బరిలో పెద్ద సినిమాల టార్గెట్ అన్నట్టు తమిళంలో దీపావళికి అలా స్టార్స్ సినిమాలు క్యూ కడతాయి.
ఈసారి దీవాళికి ఎస్-3 గా సూర్య అదరగొట్టడానికి రెడీ అయ్యాడు.
ఇక సూర్య తమ్ముడు కార్తి కూడా అదే దీవాళి టార్గెట్ తో కాష్మోరా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
గోకుల్ డైరక్షన్లో వస్తున్న కాష్మోరా కార్తి కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రాబోతుంది.అయితే తమ్ముడి కోసం సూర్య తన సింగం-3 సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంటున్నాడట.ఎస్-3 మొత్తం పూర్తయినా కేవలం తమ్ముడు కార్తి సినిమాకు అడ్డు రాకూడదనే ఉద్దేశంతోనే సూర్య తన ఎస్-3 దీవాళి రేసు నుండి తప్పుకుని డిసెంబర్ లో రిలీజ్ అంటున్నాడట.మరి అన్న ఇచ్చిన ఈ అవకాశాన్ని కార్తి ఏ రేంజ్ ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.