కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా జ్ఞానవేల్ దర్శకత్వంలో లాయర్ చంద్రు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జై భీమ్.ఈ సినిమా గత ఏడాది నవంబర్ 2వ తేదీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
ఈ సినిమాలో నటించిన హీరో సూర్యకు ఎంతో మంచి పాపులారిటీ వచ్చిందని చెప్పాలి.బడుగు బలహీన వర్గాల కోసం రూపాయి ఫీజు లేకుండా దళితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో లాయర్ చంద్రు నిజాయితీగల న్యాయవాదిగా పేరు సంపాదించారు.
అలాంటి నిజాయితీగల న్యాయవాది పాత్రలో సూర్య అద్భుతమైన నటనను కనబరిచి అన్యాయంగా పోలీసులు తన భర్తను అరెస్టు చేస్తే తనకు మద్దతుగా నిలబడి తనకు న్యాయం జరిగేలా కోర్టులో పోరాడి తనకు న్యాయం చేయడమే ఈ సినిమా కథ.ఇందులో లాయర్ పాత్రలో సూర్య జీవించారని చెప్పాలి.ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఏకంగా ఆస్కార్ అవార్డు రేసులో కూడా నిలబడింది.
ఆస్కార్ అవార్డు రేసులో ఉన్నటువంటి ఈ సినిమా ఆస్కార్ అవార్డును అందుకోలేకపోయినప్పటికీ మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులకు ఎంపిక అయ్యింది.ఎంతో గౌరవప్రదమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు జై భీమ్ చిత్రం ఎంపికయింది.ఈ సినిమాకి ఏకంగా రెండు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు వచ్చాయి.
ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ నటుడిగా ఈ సినిమాలో బాధితుడి పాత్రలో నటించిన మణికందన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినట్లు ప్రకటించారు.ఈ విధంగా తమ అభిమాన హీరో సూర్య నటించిన సినిమాకు రెండు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో సూర్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.