మళ్లీ ఢిల్లీ పీఠం 'చీపురు'కే

దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల శైలి వైపు గమనిస్తూ ఉన్నారు.రాజకీయ పండితులు మాత్రమే కాకుండా సామన్య ప్రజలు సైతం ఢిల్లీ పీఠంపై ఎగురబోతున్న జెండా ఏంటా అంటూ ఎదురు చూస్తున్నారు.

 Surveys Are Support In Amm Aadmi Party-TeluguStop.com

అక్కడ అధికారంలో ఉన్న ఆప్‌తో పాటు బీజేపీ మరియు కాంగ్రెస్‌లు తీవ్రంగా అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఢిల్లీ పీఠంపై మళ్లీ అధికారం ఎవరిది, ఎవరికి అనే సర్వేలను పలు సంస్థలు నిర్వహించాయి.

ఆ సర్వేల్లో ఎక్కువ శాతం మళ్లీ ఆమ్‌ ఆద్మీ పార్టీకే ఛాన్స్‌ ఉన్నట్లుగా వెళ్లడయ్యింది.

కాంగ్రెస్‌ మరియు బీజేపీల్లో మంచి నాయకుడు లేకపోవడంతో పాటు కేజ్రీవాల్‌ వచ్చిన తర్వాత ఢిల్లీలో చాలా మార్పులు సంభవించాయి.

కాలుష్యం విషయం తప్ప పలు విషయాల్లో ఢిల్లీని కేజ్రీవాల్‌ ముందుకు తీసుకు వెళ్లాడు.ఆయన అధికారంలో ఉన్న సమయంలో పలు సంక్షేమ పథకాలను మొదలు పెట్టాడు.ఇదే సమయంలో కేజ్రీవాల్‌ను సీఎంగా మరోసారి చేసుకుంటే ఢిల్లీని మరింతగా అభివృద్ది చేస్తాడని, ఢిల్లీలో ఉన్న నిరుపేదలకు ఆయన బాసటగా ఉంటాడంటూ ప్రజలు నమ్ముతున్నారు.అందుకే ఆప్‌కే మళ్లీ పట్టం కట్టడం ఖాయం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube