ప్రస్తుతం తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేర హాట్ టాపిక్ గా ఉందన్న విషయం మనం ప్రత్యేకంగా చెప్పుకొనక్కరలేదు.ఇక త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి గడువు ముగుస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది.
అయితే ఇక మూడు, నాలుగు రోజుల్లో ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో పార్టీలు గెలిచేందుకు తాము ఎంచుకున్న వ్యూహాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.
అయితే ఇక ప్రచారం కూడా చివరి దశకు చేరుకున్న దశలో పార్టీలు ఇక మైండ్ గేమ్ కు తెరలేపిన పరిస్థితి ఉంది.
ఇందులో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పోటాపోటీ సర్వే ఫలితాలతో గెలిచేది మేమంటే మేము అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది.అయితే ఎందుకు పార్టీలు ఈ తరహా మైండ్ గేమ్ కు తెర లేపుతున్నాయంటే ముందుగానే ఈ పార్టీ గెలుపొందే అవకాశం ఉందని ప్రజలకు తెలిస్తే ఒడిపోయే పార్టీకి ఎందుకు ఓటు వేయడం అన్న రీతిలో ప్రజల ఆలోచనా ధోరణి మారే అవకాశం ఉంది.
అయితే ప్రస్తుతం ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ మధ్య పెద్ద ఎత్తున భీకర పోటీ ఉన్న తరుణంలో ఈ సర్వే మైండ్ గేమ్ అనేది పార్టీలు తమ గెలుపుకు పెద్ద ఎత్తున దోహదపడుతుందని భావించి ఈ వ్యూహాన్ని బలంగా ఎంచుకున్న పరిస్థితి ఉంది.కాంగ్రెస్ గెలుపుపై పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ ఇక ఈ మైండ్ గేమ్ ఇరు పార్టీల గెలుపుకు ఎంత మేరకు దోహదపడుతుందనేది చూడాల్సి ఉంది.