కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు.ఈయనకు కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్నారు.
సూర్య నటనకు ఫిదా అవ్వని ఫ్యాన్స్ లేరు అంటే అతియసోక్తి కాదేమో.గజినీ సినిమాతో తెలుగులో కూడా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు సూర్య.
ఈ సినిమా తర్వాత ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.
అప్పటి నుండి ఈయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈయన నటన పరంగా ఏ రేంజ్ లో మెప్పిస్తాడో అందరికి తెలుసు.అద్భుతమైన పాత్రల్లో రాణిస్తూ వెర్సటైల్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.
అందుకే ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ రోజురోజుకూ పెరుగుతుంది.ఇక ఇటీవలే సూర్య కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ రోల్ కు విశేష స్పందన వచ్చింది.ఈ సినిమాతో మంచి స్పందన రావడమే కాకుండా సూపర్ హిట్ అవ్వడంతో ఈ సక్సెస్ ను సూర్య కూడా ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత సూర్య లైనప్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.మన తెలుగులో సూర్య మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ స్నేహితులు సూర్యతో కలిసి ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారట.
మరి స్టార్ డైరెక్టర్ శివ తో సూర్య సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాను మన తెలుగు ప్రముఖ బ్యానర్ అయినా యువీ క్రియేషన్స్ వారు నిర్మించడానికి రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది.వస్తున్న ఈ వార్త ఎంత నిజమో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట వైరల్ అయ్యింది.