కోలీవుడ్ లో హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటులు సూర్య, కార్తి, తండ్రి వారసత్వంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తమకనతూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు.ఇక వీరిద్దరు టాలీవుడ్ లో కూడా తమ సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నారు.
ఓ విధంగా చెప్పాలంటే సౌత్ లో ఈ అన్నదమ్ములు ఇద్దరిని మంచి ఇమేజ్ ఉంది.అయితే వీరిద్దరు కలిసి నటిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.
ముఖ్యంగా వారి అభిమానులు ఆశిస్తున్నారు.అయితే ఈ కాంబినేషన్ అందరూ కోరుకుంటున్నట్లు త్వరలో సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మలయాళంలో సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం తమిళ రీమేక్ లో ఈ అన్నదమ్ములిద్దరూ కలసి నటించనున్నట్టు తాజా సమాచారం.ఈ చిత్రం తమిళ రీమేక్ హక్కులను ఇటీవలే సూర్య కొనుగోలు చేశాడని టాక్ వినిపిస్తుంది.
తమ్ముడితో కలిసి ఇందులో నటించాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.ఇప్పటికే ఈ సినిమాని తెలుగులో బాలకృష్ణ, రానా కాంబినేషన్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
అలాగే హిందీలో కూడా జాన్ అబ్రహం ఈ సినిమాని రీమేక్ చేసే యోచనలో ఉన్నాడు.మొత్తానికి ఈ మలయాళీ సూపర్ హిట్ మూవీ ఏకంగా మూడు భాషలలో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.