స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఏ ఇండస్ట్రీలో అయినా ఫ్యాన్స్ అనేది ఒకేలా ఉంటారు.
మరి ఈ హీరోల ఫ్యాన్స్ వారి అభిమాన హీరోల సినిమాల అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.కానీ ఎన్నాళ్లయినా అప్డేట్ ఇవ్వకపోతే ఫ్యాన్స్ ఫైర్ అవడం సహజమే.
మరీ ఈ మధ్య ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.నెట్టింట వారు కోరుకుంటున్న విషయాలను పోస్ట్ చేస్తూ తమ హీరోలను డిమాండ్ చేస్తున్నారు.
ఇక తాజాగా కోలీవుడ్ హీరో సూర్య ఫ్యాన్స్ కూడా తమ డిమాండ్ ను అడుగు తున్నారు.వీరు సరికొత్త పద్దతిలో డిమాండ్ చేయడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు.ఈయనకు కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్నారు.సూర్య నటనకు ఫిదా అవ్వని ఫ్యాన్స్ లేరు అంటే అతియసోక్తి కాదేమో.ప్రెసెంట్ సూర్య కోలీవుడ్ డైరెక్టర్ సిరుతై శివ తో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా పీరియాడిక్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసాడు.
సూర్య కెరీర్ లో 42వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
అయితే ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఎలాంటి అప్డేట్ రావడం లేదు.దీంతో సూర్య ఫ్యాన్స్ ఏకంగా ఫ్లెక్స్ పెట్టి మరీ అప్డేట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు.దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.భాషలో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.