బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఇవాళ అల్పపీడనంగా మారనుంది.అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా అల్పపీడనం మూడు రోజులపాటు నెమ్మదిగా కదులుతుందని ఐఎండీ అంచనా వేస్తుంది.
అల్పపీడన ప్రభావంతో ఈనెల 29, 30 వ తేదీల్లో ఏపీలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.ఈ క్రమంలో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
కాగా ఏపీలో చలి తీవ్రత కొనసాగుతోంది.