సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్((84) కన్నుమూశారు.చెన్నైలోని తన నివాసంలో మంగళవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
ఈ సందర్భంగా ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు సురేష్ ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత సురేష్బాబు. “ఈశ్వర్ గారితో మా సంస్థకి విడదీయలేని అనుబంధం ఉంది.
ఈశ్వర్ గారు మా సంస్థలో అత్యధిక చిత్రాలకు పనిచేశారు.నాన్న గారికి ఆయన డిజైన్స్ అంటే ఎంతో ఇష్టం.
కేవలం పబ్లిసిటీ డిజైనర్గానే కాకుండా ఎన్నో సినిమాలకి క్యారెక్టర్ పోస్టర్స్ కూడా డిజైన్ చేశారు.
ఈశ్వర్ గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యలకు మా ప్రగాడ సానూభూతి తెలుపుతున్నాం.