దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.ఇప్పటికే చాలామంది ఈ వైరస్ బారిన పడిన వారిని ప్రభుత్వం ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తుండగా మిగతా వారు దాని బారిన పడకుండా ఇళ్లల్లోనే ఉండాలని లాక్డౌన్ ప్రకటించింది.
అయితే సినిమా ఇండస్ట్రీకి చెందిన పేద కళాకారులు ఎలాంటి పనులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికే టాలీవుడ్కు చెందని పలువుర ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు.
కాగా తాజాగా టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ అయిన సురేష్ ప్రొడక్షన్స్ పేద కళాకారులు, కరోనా వైరస్ను అరికట్టేందుకు ఆరోగ్య శాఖకు కలిపి రూ.కోటి విరాళంగా అందించారు.కరోనా మహమ్మారిని అందరం కలిసి తరమికొట్టాలని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ పిలుపునిచ్చింది.
ఇక టాలీవుడ్కు చెందిన అందరూ ముందుకు వచ్చి తమవంతు సాయం చేయాలని వారు కోరారు.
అటు సినిమాల పరంగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న నారప్ప చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు వారు ప్లాన్ చేస్తున్నారు.