గత రెండు సంవత్సరాలుగా చిత్రపరిశ్రమ అంతా నెపోటిజం చుట్టూ తిరుగుతుంది.సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్న హీరోలకి, స్టార్స్ వారసులకి తప్ప టాలెంట్ తో ఎదగాలని అనుకునేవారికి అవకాశం ఉండదని, అలాంటి వారిని ఎదగనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు.
ఎలాంటి టాలెంట్ లేకపోయిన తమ పిల్లలని ప్రోత్సహించడం కోసం చిన్న నటుల జీవితాలతో ఆడుకుంటున్నారని చాలా మంది సెలబ్రిటీ కుటుంబాలపై ఆరోపణలు చేస్తున్నారు.నెపోటిజంకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు.
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తర్వాత ఈ నెపోటిజం రచ్చ మరింత పెరిగింది.కంగనా రనౌత్ నెపోటిజం అంటూ చాలా మంది సెలబ్రిటీ వారసులని టార్గెట్ చేసింది.
బయట ప్రజలు కూడా ఆమెకి మద్దతు ఇచ్చారు.అయితే కొంత మంది నెపోటిజంకి సపోర్ట్ గా మాట్లాడారు.
తల్లిదండ్రులు తమ పిల్లలని కూడా తాము వెళ్ళిన దారిలోనే వెళ్లాలని కోరుకోవడంలో తప్పులేదని సమర్ధించారు.ఈ రచ్చ టాలీవుడ్ లో కూడా శ్రీరెడ్డి లాంటి వారి వలన ఎక్కువగా ప్రచారం అయ్యింది.
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ, నందమూరి,, దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే హీరోలుగా ఉండాలని మిగిలిన వారు ఎదగకుండా ఈ నాలుగు కుటుంబాలు ఇబ్బందులకి గురి చేస్తుంటాయని విమర్శిస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే తాజాగా నిర్మాత సురేష్ బాబు ఈ నెపోటిజంపై ఆసక్తికర వాఖ్యలు చేశారు.నెపోటిజం అనేది సమాజంలో చాలా సహజమైన విషయం.అన్ని వ్యాపారాలలో బంధుప్రీతి ఉంటుంది.
అయితే సక్సెస్ మాత్రం టాలెంట్ పైనే ఆధారపడి ఉంటుందని, ప్రతిభ లేకపోతే ఉపయోగం లేదని చెప్పుకొచ్చారు.హీరో నాని, శోభన్ కు నేను రామ్మోహన్ బ్రేక్ ఇచ్చాం.
వారు బయట నుంచి వచ్చిన వారే.అయితే వారి ప్రతిభ మాత్రమే వారిని విజయతీరాలకు చేర్చింది.
అల్లరి నరేష్ అతని సోదరుడు రాజేష్ ఇద్దరికీ సురేష్ ప్రొడక్షన్స్ బూస్ట్ ఇచ్చింది.కానీ నరేష్ మాత్రమే సక్సెస్ అందుకున్నాాడని సురేష్ బాబు అన్నారు.
ఇతర వృత్తులు వ్యాపారాలలో ఉన్న ప్రతీ తండ్రిలాగే, సినీ పరిశ్రమకు చెందిన స్టార్లు తమ పిల్లలకు ఇండస్ట్రీలో అవకాశం ఇప్పిస్తారని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.దీనిని బూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని సురేష్ బాబు తెలిపారు.