తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం కొందరి పేర్లు చిరస్మరణీయంగా ఉంటాయి.ఆ పేర్లలో ఒక పేరు డా|| డి రామానాయుడు.
ఈయన సినిమాల నిర్మాణం విషయంలో గిన్నీస్ బుక్ రికార్డును దక్కించుకున్నాడు.అంతగా సినిమాలు నిర్మించిన రామానాయుడు గారు ఒక సినిమా నిర్మించాలని చాలా ఏళ్లు అనుకుని చివరకు ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయారు.
ఆ కోరిక ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తన కొడుకు మరియు ఇద్దరు మనవళ్ల కలయికలో ఒక సినిమా చేయాలనేది రామానాయుడు కోరిక.
ఆ కోరిక సగం అయినా వెంకీమామ రూపంలో తీరిందని చెప్పుకోవచ్చు.
వెంకీమామ విడుదలకు సిద్దం అయ్యింది.ఈ సందర్బంగా సురేష్బాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ నాన్నగారి కోరిక తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది.ఆయన చివరి కోరికగా ఈ సినిమా చేయాలనుకున్నాడు.
కాని ఆయన కోరిక తీరకుండానే చనిపోయారు.ఇప్పుడు ఈ సినిమాతో ఆయన కోరిక తీరింది.
నాన్నగారి కోరిక అవ్వడంతో ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించామంటూ సురేష్బాబు చెప్పుకొచ్చాడు.సినిమా విషయంలో సురేష్బాబు చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు.
వెంకటేష్ మరియు నాగచైతన్యలు మామ అల్లుడుగా నటించారు.వీరిద్దరు కూడా చాలా మాస్ లుక్లో అలరిస్తున్నారు.భారీ ఎత్తున మాస్ అప్పీల్ ఉన్న ఈ సినిమాలో హీరోయిన్స్గా రాశిఖన్నా మరియు పాయల్ రాజ్ పూత్లో నటించారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.జై లవకుశ తర్వాత బాబీ మళ్లీ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.