వెంకటేష్, నాగచైతన్యలు హీరోలుగా నటిస్తున్న ‘వెంకీమామ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.దర్శకుడు బాబీ ఈ చిత్రంను చాలా విభిన్నమైన కథాంశంతో తెరకెక్కించాడు.
సురేష్బాబు నిర్మించిన ఈ చిత్రం విడుదల తేదీ విషయంలో గందరగోళం కనిపిస్తుంది.మొదట ఈ దసరాకు వెంకీమామ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు.
కాని ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా విడుదల వాయిదా వేస్తూ వచ్చారు.దసరా తర్వాత మామూలుగా దీపావళికి సినిమాలు విడుదల అవుతాయి.
కాని వెంకీ మామ కొన్ని కారణాల వల్ల దీపావళికి కూడా రావడం లేదు.
దాదాపు సంవత్సరం క్రితం షూటింగ్ ప్రారంభం అయిన వెంకీ మామ షూటింగ్ అంతా పూర్తి అయ్యింది.ఒక్క పాట మినహా అంటున్నారు కాని అది కూడా పూర్తి అయ్యింది.షూటింగ్ పూర్తి అయ్యి కూడా నెల రోజులు దాటిందని అంటున్నారు.
షూటింగ్ పూర్తి అయినా కూడా సేఫ్ టైంలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రంను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.నిర్మాత సురేష్బాబు చిన్న బడ్జెట్తో సినిమాలు నిర్మించినా కూడా మంచి టైంలో విడుదల చేసి క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు.
వెంకీమామ ఫ్యామిలీ కంటెంట్ చిత్రం.అందుకే దానికి పోటీ లేకుండా ఉన్న సమయంలో విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందనే నమ్మకంతో సురేష్ బాబు ఉన్నాడు.త్వరలోనే సినిమాను విడుదల చేసే తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వనున్నారు.క్రిస్మస్ కానుకగా డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.ఆ సమయంలో పోటీ ఎక్కువ లేకపోవడంతో వెంకీ మామ కుమ్మేయనుందేమో చూడాలి.ఈ చిత్రంలో పాయల్ రాజ్ పూత్ మరియు రాశిఖన్నాలు హీరోయిన్స్గా నటించిన విషయం తెల్సిందే.