ఈ నెలలో షూటింగ్స్కు అనుమతించబోతున్న ప్రభుత్వం వచ్చే నెలలో థియేటర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంతా భావిస్తున్నారు.థియేటర్లు రీ ఓపెన్ అయితే విడుదల అయ్యేందుకు కొన్ని సినిమాలు అప్పుడే పబ్లిసిటీ కూడా ప్రారంభించాయి.
అయితే ప్రముఖ నిర్మాత సురేష్బాబు మాత్రం థియేటర్లు ఇప్పట్లో ఓపెన్ చేయడం సరికాదంటూ తనకున్న అనుభవంతో చెబుతున్నాడు.సుదీర్ఘ విరామం తర్వాత చైనాలో థియేటర్లు ఓపెన్ చేశారు.
అక్కడ విడుదలకు సినిమాలు లేకపోవడంతో మళ్లీ థియేటర్లను మూసేయాల్సి వచ్చింది.
చైనా థియేటర్స్ పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండాలి అంటే షూటింగ్స్ ప్రారంభం అయిన కనీసం రెండు నెలల తర్వాతే సినిమా థియేటర్లను ప్రారంభించాలంటూ పేర్కొన్నాడు.
ఇప్పుడు విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలన్నీ ఒకే సారి విడుదల అయితే ఆ తర్వాత మళ్లీ థియేటర్లలో విడుదలకు సినిమాలు ఉండవు.అందుకే రెండు నెలల్లో సినిమాలు విడుదలకు సిద్దం అవుతూ ఉంటాయి.
గతంలో మాదిరిగా సర్కిల్ కొనసాగుతుందని సురేష్బాబు అన్నాడు.
సినీ ప్రముఖులు పలువురు సురేష్బాబు నిర్ణయంతో ఏకీభవిస్తున్నారు.కనుక సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు థియేటర్లు ఓపెన్ కాకపోవచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లు సురేష్బాబు మరియు ఆయన సన్నిహితుల ఆధీనంలో ఉంటాయి అంటారు.
కనుక వారు ఏం చెబితే అదే జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.