కరోనా వైరస్.ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.రోజు రోజుకు కరోనా వైరస్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి.ఇప్పట్లో ఈ కేసులు తగ్గేలా కూడా లేవు.చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కు ఎవరైనా ఒకటే.ఇంకా అలానే పేద ధనిక అని తేడా లేకుండా పరిశుభ్రంగా, జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్న వారందరికీ కరోనా వైరస్ వ్యాపిస్తుంది.
ఇంకా ఇప్పటికే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కరోనా వైరస్ వ్యాపించింది.ఇంకా ఈ నేపథ్యంలోనే గోవా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంకర్ కరోనా వైరస్ వ్యాపించగా అతను కరోనాతో నిన్న మరణించారు.
జూన్ నెల చివరి వారంలో ఆయనకు కరోనా పాజిటివ్గా రాగ అతన్నీ ట్రీట్మెంట్ కోసం మార్మోవాలోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు.
దీంతో అతని ఆరోగ్యం పూర్తిగా క్షిణించింది.ఇంకా నిన్న చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు.ఇంకా సురేష్ అమోంకర్ మృతిని గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె దృవీకరించారు.
కాగా సురేష్ అమోన్కర్ మృతి పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
గోవాలో ఇలా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి మరణించగా ప్రస్తుతం గోవాలో 18 వందల కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఒకానొక సమయంలో కరోనా రహిత రాష్ట్రంగా పేరొందిన గోవాలో ఇప్పుడు ఏకంగా మాజీ ఆరోగ్యశాఖ మంత్రి చనిపోయారు.