టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజియస్ట్ హీరోయిన్ గా కన్నడ భామ కృతి శెట్టి ఉంది.మెగాస్టార్ చిరంజీవి ఏకంగా ఈ అమ్మడు అందం, అభినయం చూసి ఫిదా అయిపోయి ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ అనేసాడంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఆమె మానియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
చిరంజీవి అంతటి వాడినే ఫిదా చేసిన ఈ అమ్మడు అందానికి ఇప్పుడు దర్శకులు కూడా ఫిదా అయిపోయి ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.ఉప్పెన సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే నానికి జోడీగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో పాటు సుదీర్ బాబు, ఇంద్రగంటి సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి అవకాశాలు సొంతం చేసుకుంది.
ఈమె అందానికి ప్రేక్షకులు కూడా ఇప్పటికే కనెక్ట్ అయిపోయారు.ఇక చిరంజీవి ఇంప్రెషన్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు మిగిలిన దర్శక, నిర్మాతలు, హీరోలు కూడా కృతి శెట్టిపైన ఫోకస్ పెట్టారు.
ఈ నేపధ్యంలో సురేందర్ రెడ్డి నెక్స్ట్ అఖిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు రష్మిక మందన గాని లేదంటే కొత్త అమ్మాయిని గాని తీసుకోవాలని ప్లాన్ చేశారు.అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి ఫోకస్ కృతి శెట్టి మీద పడినట్లు తెలుస్తుంది.
అఖిల్, కృతి శెట్టి పెయిర్ పెర్ఫెక్ట్ గా ఉంటుందని ఆమెని ఫైనల్ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది.అలాగే ఈ అమ్మడుకి అఖిల్ సినిమా కోసం అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
త్వరలో కృతి శెట్టిని అఖిల్ హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసి అఫీషియల్ గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని బోగట్టా.
.