రామ్ చరణ్తో ధృవ మరియు చిరంజీవితో సైరా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.సైరా చిత్రం సమయంలో కొన్ని ఆర్థిక వివాదాల కారణంగా సురేందర్ రెడ్డి చాలా సీరియస్ అయ్యాడు.
నిర్మాత అయిన చరణ్పై ఒత్తిడి చేశాడని అందుకే సురేందర్ రెడ్డిని పక్కకు పెట్టాలని మెగా కాంపౌండ్ మొత్తం నిర్ణయం తీసుకుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలోనే ఈ వార్తలు వచ్చాయి.
కాని అప్పుడు అవి పుకార్లుగానే అనుకున్నారు.అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మళ్లీ ఆ చర్చ మొదలవుతోంది.
సైరా చిత్రం తర్వాత బన్నీ మరియు వరుణ్ తేజ్లతో సూరి ప్రయత్నాలు చేసినా కూడా వారు ఓకే అన్నట్లుగానే అని నో చెప్పారు అంటూ టాక్ వినిపిస్తుంది.వారిద్దరితో కూడా సురేందర్ రెడ్డికి మంచి పరిచయాలు ఉన్నాయి.
కాని ఇప్పుడు మాత్రం వారు సూరికి కాస్త దూరం పాటిస్తున్నారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సురేందర్ రెడ్డి మెగా హీరోలతో సినిమాల ప్రయత్నాలు వదిలేసి మాస్ రాజా రవితేజతో సినిమాకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది.ఇటీవలే రవితేజకు స్టోరీ చెప్పిన దర్శకుడు ఓకే చెప్పించుకున్నాడట.అయితే ఇప్పటికే రవితేజ క్రాక్ చిత్రం చేస్తున్నాడు.
అది కాకుండా త్రినాధరావు నక్కిన మరియు రమేష్ వర్మల దర్శకత్వంలో సినిమాలకు కమిట్ అయ్యాడు.ఆ రెండు సినిమాల తర్వాత సూరి దర్శకత్వంలో రవితేజ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
రవితేజ తర్వాత అయినా మెగా కాంపౌండ్ లోకి సూరి ఎంట్రీ ఉంటుందేమో చూడాలి.