ఓ పక్క మెగాస్టార్ 150వ సినిమా కోసం నిర్మాతగా మారిన రాం చరణ్ మరో పక్క తన సినిమా షూట్లో కూడా పాల్గొంటూ ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నాడు.ఇక చరణ్ చేసే సినిమా పట్ల కూడా ఓ కన్నేసుంచిన చిరు తని ఓరువన్ రీమేక్ గా చేస్తున్న ధ్రువ సినిమా అవుట్ పుట్ మీద అంత సాటిస్ఫైడ్ గా లేడు అన్నది ఫ్రెష్ అప్డేట్.
సినిమా అయితే స్టైలిష్ గా వస్తుంది కాని కాన్సెప్ట్ వర్క్ అవుట్ అయినట్టు కనిపించలేదని అన్నాడట.ఇక ఇదే విషయం మీద డైరక్టర్ సురేందర్ రెడ్డిని పిలిపించి మరి మందలించాడట చిరంజీవి.
ఓ పక్క చరణ్ సినిమా చాలా స్టైలిష్ గా రావాలంటూ చెబుతున్నాడట.అయితే ఈ మెగా తండ్రి కొడుకుల మధ్య సూరి నలిగిపోతున్నాడని టాక్.
లాస్ట్ ఇయర్ వచ్చిన బ్రూస్ లీ ఫ్లాప్ అవడంతో ధ్రువను ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న చరణ్ సినిమా విషయంలో కంగారు పడుతున్నాడట.మరో పక్క చిరు సినిమాకు నిర్మాత భాధ్యతలు కూడా మీద వేసుకునే సరికి చేస్తున్న సినిమా మీద అంత దృష్టి పెట్టలేకపోతున్నాడట.
మరి తన కెరియర్ ను డిసైడ్ చేసే ధ్రువ విషయంలో చెర్రి ఇలా చేయడం ఫ్యాన్స్ కు కాస్త కంగారు కలిగేలా చేస్తుంది.