అక్కినేని అఖిల్ 5వ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.చాలా మంది దర్శకులతో చర్చలు జరిపిన తర్వాత చివరకు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రస్తుతం అఖిల్ చేస్తున్న నాల్గవ సినిమా మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దం అవుతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా నిర్మాత అనిల్ పేర్కొన్నాడు.
భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న అఖిల్ 5 సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట.ఎందుకంటే చరణ్ గతంలో ఓకే చెప్పిన కథతో ఇప్పుడు అఖిల్తో సురేందర్ రెడ్డి సినిమా తీస్తున్నాడు.
ఈ విషయం దాదాపు సినీ వర్గాల వారు అందరు కూడా అంటున్నారు.అఖిల్ కు ఈ సమయంలో ఒక సక్సెస్ కావాలి.
అది ఒక మంచి స్టోరీతో చేస్తేనే దక్కుతుంది.అందుకే చరణ్ తనకు నచ్చిన కథను అఖిల్ కు ఇచ్చేశాడట.దాదాపు రెండు మూడు సంవత్సరాల క్రితం దర్శకుడు సురేందర్ రెడ్డి చరణ్ తో ధృవ సినిమా చేస్తున్న సమయంలో ఈ కథ చెప్పాడట.తప్పకుండా చేద్దాం.చాలా యూనిక్ గా ఉంది అంటూ ప్రశంసించాడట.ధృవ మంచి విజయాన్ని దక్కించుకోవడంతో తప్పకుండా మరో సినిమా వీరి కాంబోలో వస్తుందని అనుకున్నారు.
అయితే చిరంజీవి హీరోగా సూరి దర్శకత్వంలో సైరా వచ్చింది.ఆ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకుంది.
ఆ సినిమా తర్వాత చరణ్ తో సినిమా చేయాలని వెయిట్ చేస్తున్నాడు.అయితే చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి చేయడంతో పాటు ఆ తర్వాత ముందే కమిట్ అయిన రెండు సినిమాలను కూడా పూర్తి చేయాల్సి ఉంది.
దాంతో చరణ్ కాస్త సమయం పడుతుందని, ఈ లోపు అదే కథతో అఖిల్తో సినిమా చేయాల్సిందిగా సురేందర్ రెడ్డికి తెలియజేశాడట.అఖిల్ అక్కినేని అంటే చరణ్ కు ప్రత్యేకమైన అభిమానం.
చిరంజీవి మరియు చరణ్ లకు అఖిల్ పై ఉన్న అభిమానం కారణంగానే అతడి కెరీర్ ను పైకి తీసుకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకే అఖిల్ నాల్గవ సినిమాను గీతా ఆర్ట్స్ లో చేయించడంతో పాటు ఇప్పుడు చరణ్ తన కథను ఇచ్చేశాడు.
మరి అఖిల్కు మెగా సపోర్ట్ ఇంత దక్కినప్పుడు అయినా సక్సెస్ దక్కేనా చూడాలి.