టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖవాణి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ రోజురోజుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.ప్రస్తుతం ఆమెకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
ఈ విధంగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత అలాగే కొంతమందితో కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు.
ఇలా వీరందరూ కలిసి తరచూ వెకేషన్ కి వెళ్లడం పార్టీలు చేసుకోవడంతో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు.
సురేఖ వాణి గ్యాంగ్ కి సంబంధించిన ఓ నటి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే.హోలీ పండుగ సందర్భంగా కొబ్బరి బొండంలో మద్యం కలుపుకొని తాగి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదానికి గురై మరణించారు.
ఇకపోతే సురేఖ తన గ్యాంగ్ తో కలిసి ఒకే పదాన్ని టాటూగా వేయించుకున్నారు.ఇలా ఒకే పదాన్ని వీరందరూ వేరు వేరు చోట్ల టాటుగా వేయించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఒకరు కాలు మీద, మరొకరు చేతి మీద, మరొకరు కాలి మడమ మీద టాటూ వేయించుకున్నారు.ఇలా వీరందరూ కలిసి కర్మ అనే పదాన్ని టాటూగా వేయించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.ఇకపోతే వీరందరూ ఒకే పదాన్ని టాటూగా వేయించుకోవడంతో వీరంతా కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.ఇక సురేఖ వాణి పలు సినిమాలతో బిజీగా ఉండగా తన కూతురు సైతం లేచింది మహిళలోకం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైందని తెలుస్తోంది.