పూరీ జగన్నాథ్ కి ఆ పిల్ల మీద కన్ను పడింది

వ్యక్తిగత వివాదాలూ, రెండు వరస భారీ ప్లాపు సినిమాలతో పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ట్రాక్ లో వెనక పడి ఉన్నాడు.తన తదుపరి సినిమా విషయం లో పూరీ విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది.

 Puri Jagannath Eyes On Surabhi-TeluguStop.com

ఒకే రోజు ఇద్దరు నందమూరి హీరోలైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రాం లకి కథలు చెప్పి మరీ ఓకే చేయించుకున్న పూరీ ఈ సినిమాలు రెండూ చాలా మంచిగా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.

పూరీ జగన్నాథ్ సినిమాల్లో నటించిన ఐటెం గర్ల్స్ కానీ హీరోయిన్ లు కానీ మంచి స్టాండ్ కి వెళ్ళారు అని చెప్పచ్చు.

ఇప్పుడు ఈ దర్శకుడు కళ్యాణ్ రాం తో తీయబోయే సినిమా కి సురభి ని సంప్రదిస్తున్నాడు.ఎక్స్ ప్రెస్ రాజా, బీరువా లాంటి సినిమాలతో తెలుగువారికి పరిచయం అయిన ఈమెకి మంచి నటిగా పేరు కూడా వచ్చింది.

యాక్టింగ్ తో పాటు గ్లామర్ విషయంలోనూ పెద్దగా బోర్డర్స్ లేకపోవడంతో మంచి అవకాశాలే అమ్మడి తలుపు తడుతున్నాయి.

కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించి హీరోగా నటించనున్న సినిమాలో ఈ నందమూరి హీరోకి జంటగా సురభి దాదాపు కన్ఫాం అయినట్లే అంటున్నారు.

జ్యోతిలక్ష్మి – లోఫర్ ఫ్లాప్ ల కారణంగా.ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube