వ్యక్తిగత వివాదాలూ, రెండు వరస భారీ ప్లాపు సినిమాలతో పూరీ జగన్నాథ్ ప్రస్తుతం ట్రాక్ లో వెనక పడి ఉన్నాడు.తన తదుపరి సినిమా విషయం లో పూరీ విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని తెలుస్తోంది.
ఒకే రోజు ఇద్దరు నందమూరి హీరోలైన ఎన్టీఆర్ , కళ్యాణ్ రాం లకి కథలు చెప్పి మరీ ఓకే చేయించుకున్న పూరీ ఈ సినిమాలు రెండూ చాలా మంచిగా తీయాలని ప్లాన్ చేస్తున్నాడు.
పూరీ జగన్నాథ్ సినిమాల్లో నటించిన ఐటెం గర్ల్స్ కానీ హీరోయిన్ లు కానీ మంచి స్టాండ్ కి వెళ్ళారు అని చెప్పచ్చు.
ఇప్పుడు ఈ దర్శకుడు కళ్యాణ్ రాం తో తీయబోయే సినిమా కి సురభి ని సంప్రదిస్తున్నాడు.ఎక్స్ ప్రెస్ రాజా, బీరువా లాంటి సినిమాలతో తెలుగువారికి పరిచయం అయిన ఈమెకి మంచి నటిగా పేరు కూడా వచ్చింది.
యాక్టింగ్ తో పాటు గ్లామర్ విషయంలోనూ పెద్దగా బోర్డర్స్ లేకపోవడంతో మంచి అవకాశాలే అమ్మడి తలుపు తడుతున్నాయి.
కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మించి హీరోగా నటించనున్న సినిమాలో ఈ నందమూరి హీరోకి జంటగా సురభి దాదాపు కన్ఫాం అయినట్లే అంటున్నారు.
జ్యోతిలక్ష్మి – లోఫర్ ఫ్లాప్ ల కారణంగా.ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్.