సురేఖా వాణి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.ఇంతకంటే ఆమె అంత పాపులర్.
సినిమాల కంటే సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యింది.ఇప్పటికే కుర్ర హీరోయిన్లకు పోటీనిచ్చేలా తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ కుర్రకారు మదిని దోచేస్తుంది.
ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే సురేఖా వాణి తన కూతురుతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ నానా హంగామా చేస్తుంది.
ఈమె చేసే కొన్ని ఫోటోల వల్ల జనాల్లో విపరీతంగా పేరు సంపాదించుకుంది.తాజాగా తన రెండో పెళ్లి పై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సురేఖ వాణి భర్త సురేష్ తేజ 2019 లో అనారోగ్య సమస్యలతో మరణించాడు.తాజాగా ఇప్పుడు సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతుందని ఆమె కూతురు బలవంతం చేయడం వల్ల రెండో పెళ్ళికి సిద్ధపడిందని వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయం పై సురేఖ వాణి స్పందించింది.
తాను రెండో పెళ్లి చేసుకోవడం అనే వార్తలో అస్సలు నిజం లేదని తెలిపింది.తాను మళ్ళీ వివాహబంధంలో అడుగుపెట్టాలని అనుకోవడం లేదని వివరించింది.అయినా ఈ వార్తలు ఆగడం లేదు.
తాజాగా ఆమె కూతురు సుప్రీతా కూడా ఈ వ్యవహారంపై మీడియా మీద సీరియస్ అయ్యింది.ఆమె తల్లిపై వస్తున్న వార్తలను ఖండించింది.
జర్నలిజం అంటే నిజాలు మాత్రమే రాయాలని ఇలాంటి అబద్దపు రాతలు రాస్తే అది జర్నలిజం అనిపించుకోదని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసారు.అంతేకాదు మీ రెవెన్యూ కోసం పక్కవారి ఇమేజ్ డామేజ్ చేయకూడదని దాని వల్ల వాళ్ళ కెరీర్ కూడా పాడవుతుందని సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది.
ఇప్పుడు ఈమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.