తాజాగా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల అమలు విషయంలో ఓ సంచలనం నిర్ణయం తీసుకొని తీర్పును వెల్లడించింది.ఓపెన్ కేటగిరి అభ్యర్థులతో సమానంగా బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యర్థులకు కూడా సమానమైన మార్కులు వస్తే రిజర్వ్డ్ కేటగిరీలో కాకుండా జనరల్ కేటగిరిలో అడ్మిషన్స్ అందజేయాల్సి ఉంటుంది.
సాధారణ మార్కులతో క్వాలిఫై అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్ కేటగిరీలో అందుబాటులో ఉంటుంది.ఈ మేరకు జస్టిస్లు హృషికేష్ రాయ్, సంజయ్ కిషన్ కౌల్, దినేష్ మహేశ్వరిలతో కూడిన సుప్రీం ధర్మాసనం తాజాగా తీర్పును తెలియజేసింది.
గ్రేడ్ – 1 గ్రాడ్యుయేట్ అసిస్టెంట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ల పోస్టుల కోసం దరఖాస్తులు నిర్వహించారు.ఇందులో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిషన్ల కోసం జాబితాలో పరిశీలించినప్పుడు కొందరు అభ్యర్థులు రిజర్వేషన్ లతో ఎటువంటి సంబంధం లేకుండా ఎంపిక చేశారని వారు గుర్తించడంతో అభ్యర్థులను జనరల్ విభాగం కింద పరిగణించకుండా ఎంబీసీ కోటా కింద పరిగణించి నియమించాలని వారు గ్రహించారు.
జనరల్ కో టాకు బదులుఎంబీసీ/డీఎన్సీ కోట కు వ్యతిరేకంగా ఇతర అభ్యర్థులను నియమించినందుకు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ తరుణంలో న్యాయమూర్తులు తమిళనాడు ప్రభుత్వ సేవకుల (సేవా నిబంధనలు) చట్టం, 2016 లోని సెక్షన్ 27 (ఎఫ్) కు ప్రకారం అప్పీల్ పై సుప్రీం కోర్టు తీర్పును వెల్లడించారు.
ముందు అభ్యర్థుల అందరికీ సాధారణ కేటగిరిలో సర్దుబాటు చేయాలని, అనంతరం బ్యాక్ క్లబ్ ఖాళీలను రిజర్వ్ కేటగిరీలో భర్తీ చేయాల్సి ప్రతిపాదనల్లో పేర్కొన్నారు .ఈ తరుణంలో స్పందించిన సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్లను అమలు చేసేటప్పుడు మాత్రమే ముందుగా మెరిట్ సీట్లను భర్తీ చేయాల్సిన తర్వాతనే రిజర్వేషన్ కేటగిరీలో భర్తీలు పూర్తి చేయాలని సంచలన తీర్పు తెలిపింది.