ఢిల్లీ ప్రజలని పేలుడు పదార్ధాలతో చంపేయండి... సుప్రీం సంచలన వ్యాఖ్యలు

దేశ రాజధాని డిల్లీలో కాలుష్యం ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిందే.కాలుష్య ప్రభావం వలన ప్రజలు అక్కడ తీవ్ర అవస్థలు పడుతున్నారు.

 Supreme On Delhi Pollution-TeluguStop.com

ఇక శీతాకాలం వస్తే దట్టమైన పొగమంచుతో పాటు, కాలుష్య ప్రభావం వలన శారీరక సమస్యలు కూడా అనుభవిస్తున్నారు.అక్కడ కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న తగ్గడం లేదు.

ఓ విధంగా చెప్పాలంటే ఢిల్లీలో జీవనం అంటే మరణశయ్య మీద పడుకొని మృత్యువు కోసం ఎదురుచూడటం లాంటిది అని అక్కడ ఉన్నవారు అంటూ ఉన్న మాట.ఇదిలా ఉంటే ఢిల్లీ కాలుష్యంపై అత్యున్నత న్యాయస్థానం సంచలన వాఖ్యలు చేసింది.అక్కడి ప్రజల వెతలపై దాఖలవుతున్న పిటిషన్లపై విచారణ జరుపుతున్న అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వాలకి మొట్టికాయలు పెట్టింది.ప్రజల అవస్థలు ప్రభుత్వాలకు పట్టవా అంటూ పంజాబ్, హరియాణా రాష్ట్రాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

గ్యాస్ ఛాంబర్ లాంటి ఢిల్లీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ, ఇంతకంటే వారిని ఒకేసారి పేలుడు పదార్థాలతో చంపేస్తే బాగుంటుందని వ్యాఖ్యానించింది.మీ వల్ల ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి.

వారిని బలవంతంగా గ్యాస్ ఛాంబర్‌లో ఎందుకు ఉంచుతున్నారు.ఇంతకంటే పేలుడు పదార్థాలతో అందర్నీ ఒకేసారి చంపేయండి అంటూ న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube