షెడ్యూల్ కులాల వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుమతి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ మేరకు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని సుప్రీం తెలిపింది.కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ మాత్రమే సమస్య పరిష్కరించాలని పేర్కొంటూ ఎస్సీ వర్గీకరణపై కీలక తీర్పు ఇచ్చింది.18 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ లేక మాదిగ ఉప కులాలు తీవ్రంగా నష్టపోయాయని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.ధర్మాసనం తీర్పుతో త్వరలోనే న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.