ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.
విచారణ నేపథ్యంలో జస్టిస్ కౌల్ సంచలన కామెంట్ చేశారు.
ఉద్యోగ సంఘాలు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.దేశంలో ప్రస్తుతం ఎక్కడ ఎన్నికలు జరగడం లేదా .? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.అంతేకాకుండా రాజ్యాంగ ప్రక్రియలో భాగంగా అప్పట్లో కరోనా ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు కావాలన్న విషయాన్ని గుర్తు చేశారు.ఇదే తరుణంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తప్పుపడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని, అందువల్ల ఎన్నికలు ఏపీ లో ప్రతిసారి వాయిదా పడుతున్నాయని జస్టిస్ కౌల్ స్పష్టం చేశారు.
ఈ పరిణామంతో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లయింది.