ఐపీఎల్ను కుదిపేస్తున్న స్పాట్ ఫిక్సింగ్పై సుప్రీం కోర్టు తుది తీర్పును ఇచ్చింది.చెన్నై సూపర్ కింగ్స్ గురునాధ్ మేయప్పన్ మరియు రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రాలు బెట్టింగ్లో ఉన్నట్లుగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.
ఐపీఎల్లో ఫిక్సింగ్ జరిగిందని కోర్టు నిర్దారించింది.కాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు ఈ కేసులో క్లీన్ చీట్ను సుప్రీం కోర్టు ఇచ్చింది.ఈ కేసు తుది తీర్పును సుప్రీం కోర్టు 130 పేజీల్లో పొందు పర్చడం జరిగింది.
18 నెలల క్రితం స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం బయటకు వచ్చింది.ఆ సమయంలోనే వీరిద్దరిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.వీరితో పాటు బీసీసీఐ అప్పటి అధ్యక్షుడు శ్రీనివాసన్పై కూడా రావడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
గురునాధ్ మరియు మేయప్పన్లు దోషులుగా తేలడంతో వీరి జట్లపై వేటు వేసే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.ఐపీఎల్ నుండి ఈ రెండు జట్లు కూడా వెళ్లిపోతే పెద్ద కుదుపు తప్పదు అని క్రిడా నిపుణులు అంటున్నారు.