దేశంలో ఎక్కువ కరోనా కేసులు పడుతున్న రాష్ట్రాలలో ముందు నుండి ఢిల్లీ పేరు వినబడుతున్న సంగతి తెలిసిందే.భయంకరంగా కేసులు పెరిగిపోతుండటంతో ఢిల్లీలో కరోనా బారిన పడిన రోగులు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు విడిచే పరిస్థితి.
దీంతో కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ ఇంకా అనేక నిర్ణయాలు తీసుకున్నారు, కాని ప్రస్తుతం మాత్రం అక్కడ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న ఉండటంతో పాటు ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు.
ఇలాంటి తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం తమకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా కావడం లేదని కీలక కామెంట్లు చేసింది.
దీంతో ఢిల్లీకి ఆక్సిజన్ మూడవ తారీఖు అర్ధరాత్రి లోపు ఆక్సిజన్ సమస్య తీర్చాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది.ఒక ఢిల్లీలో మాత్రమే కాక దేశంలో మిగతా రాష్ట్రాలలో కూడా కేసులు పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాలు బఫర్ స్టాక్ నిల్వ ఉంచుకోవాలని సుప్రీం పేర్కొంది.
.