అబార్షన్లపై భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది.పెళ్లితో సంబంధం లేకుండా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందని తెలిపింది.
పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్ను అడ్డుకోలేరని ధర్మాసనం పేర్కొంది.ఏ మహిళకైనా అబార్షన్ చేయించుకునే హక్కు ఉందన్న న్యాయస్థానం.
ఎంటీపీ చట్టం ప్రకారం పెళ్లికాని మహిళలు అబార్షన్ చేసుకునే హక్కు ఉందని వెల్లడించింది.అబార్షన్ చట్టం ప్రకారం వివాహితులు, అవిహితులు అనే తేడా లేదని చెప్పింది.
ఈ క్రమంలో గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది.చట్ట ప్రకారం సురక్షితమైన అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం స్పష్టం చేసింది.
అదేవిధంగా భర్త బలవంతంగా శృంగారం చేయడం వల్ల గర్భం వస్తే తొలగించుకునే హక్కు భార్యకే ఉంటుందని వెల్లడించింది.