అయోధ్య కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు చివరి దశకి చేరుకుంది.ఈ కేసులో దశాబ్దాలుగా హిందూ, ముస్లిం ల మధ్య వాదనలు విన్న సుప్రీం కోర్ట్ చివరికి రెండు వర్గాల మధ్య వర్తిత్వంతో సమస్యని పరిష్కరించుకోవాలని తీర్పు చెప్పింది.
దాంతో పాటు రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి సుప్రీం కోర్ట్ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది.
ఇక ఈ కమిటీలో న్యాయవాది శ్రీరాం పంచు, పండిట్ రవిశంకర్ లు సభ్యులుగా ఉంటారని పేర్కొంది.
ఇక ఈ కమిటీ నాలుగు వారాలలో నివేదిక ఇచ్చి, ఎనిమిది వారాలలోగ సమస్యని పరిష్కరించాలని ధర్మాసనం సూచించింది.
అయితే ఈ మధ్యవర్తిత్వంకి ముస్లిం సంఘాలు ఒకే చెప్పిన కూడా హిందూ సంఘాలు మాత్రం అభ్యంతరం చెబుతున్నాయి.అసలు మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారం కాదని వాదిస్తున్నాయి.
అయితే సుప్రీం కోర్ట్ మాత్రం హిందూ సంఘం తరుపున న్యాయవాది వాదనలు తోసిపుచ్చి మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కరించుకోవాల్సిందే అని తీర్పు వెలువరించింది.
.