చిత్రసీమలో జరిగే సిత్రాలు ఎన్నో కానీ అప్పుడప్పుడు మాత్రమే ఇవి బయటకు వస్తాయి.కాగా ప్రస్తుతం టాలీవుడ్లో గత కొంతకాలం నుండి ప్రముఖ కెమెరామన్ శ్యామ్ కె నాయుడుపై వివాదం నడుస్తున్న సంగతి విదితమే.
ఇది వరకే నటి శ్రీ సుధ హైదరాబాద్లోని ఎస్.ఆర్.నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ కధ రకరకాల మలుపులు తిరిగింది.
అదీగాక విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో, హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇతని పై ఫిర్యాదు చేసిన శ్రీసుధ, ఈ కేసులో శ్యామ్ కె నాయుడుకు లభించిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
కాగా గత కొంతకాలంగా శ్యామ్ కె నాయుడుపై న్యాయపోరాటం చేస్తున్న శ్రీసుధ, గతంలో వేసిన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టింది.
ఈ కేసులో కెమెరామన్ శ్యామ్ కె నాయుడుకు నోటీసులు జారీ చేసింది.నెల రోజుల్లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలంటూ ఆదేశించింది.
ఇకపోతే పెళ్లి పేరుతో సహజీవనం చేసి మోసం చేశాడనే సుధ వివాదం ఎన్నడు ముగుస్తుందో తెలియదు.లేదా పలుకుబడి ముసుగులో ఆటక ఎక్కుతుందో తెలియదు.