రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.పిటిషన్లను త్వరగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు.
ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్ ధర్మాసనం వద్ద న్యాయవాది ప్రత్యేకంగా ప్రస్తావించారు.మరోవైపు కోర్టు నోటీసులు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెథలిపారు.
ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల సమయం కావాలని లాయర్లు కోరారు.అనంతరం తదుపరి విచారణను ఈనెల 23న చేపడతామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.