బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో రెండు పిటిషన్లపై విచారించిన ధర్మాసనం… పబ్లిక్ డొమైన్ నుంచి డాక్యుమెంటరీని తీసివేయడానికి ఆర్డర్ అసలు రికార్డును కోరింది.
ఈ వివాదానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.దీనిపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
అయితే, 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఆరోపణలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన వివాదాస్పద బీబీసీ డాక్యుమెంటరీపై నిషేధాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలైన సంగతి తెలిసిందే.