తీవ్రకరమైన నేరాలు దేశం లో నానాటికీ పెరుగుతూ ఉన్నాయి, ఈ శాతం చాలా ఎక్కువగా ఉండడంతో పసిమొగ్గలు లాంటి చిన్నారులు అత్యాచారానికి గురై చనిపోతున్నారు.ఈ దుర్మార్గాలకి కారణమైన వారికి సరైన శిక్ష లేకపోవడమే అసలైన ఇబ్బంది అని దీని వలనే కారకులు రెచ్చిపోతున్నారు అనీ అంటున్నారు విశ్లేషకులు.
సుప్రీం కోర్టు కూడా దీనిని పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.తాజాగా దీనికి సంబంధించిన ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది.
దేశంలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల నియంత్రణ విషయంలో ఎంపీలు నిర్ణయం తీసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచన చేసింది.రేపిస్టులకు భారీ దండన విధించే విషయంపై చట్టం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిదుల మీదనే ఉందన్న విషయాన్ని సుప్రీం గుర్తు చేసింది.
అలాంటి వారిని నపుంసకులు గా మార్చాలనే చట్టాన్ని డిమాండ్ చేస్తూ మహిళా న్యాయవాదుల సంఘం సుప్రీం కి అభ్యర్ధన చేసింది , దీని మీద సుప్రీం స్పందించింది.ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి విధించే శిక్షలకు చట్టరూపం కల్పించే బాధ్యత ఎంపీల మీదనేనని సుప్రీం తేల్చిన నేపథ్యంలో.
వారెలా స్పందిస్తారో చూడాలి.ఇప్పటికే ఇలాంటి శిక్ష పలు దేశాల్లో అమలవుతుంది.