కొత్త సంవత్సరంలో ఏపీలో హైకోర్ట్ ఏర్పడిపోయింది.అయితే ఏపీ తెలంగాణ రాష్ట్రాలు రెండుగా విడిపోయి నాలుగున్నర ఏళ్ళు దాటినా తరువాత ఈ ప్రక్రియ పూర్తి అయ్యింది.
అసలు రాష్ట్రము విడిపోయిన దగ్గర నుంచి ఈ ప్రస్తావన అనేకసార్లు వచ్చినా… ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూనే వస్తోంది.కానీ ఇప్పటికి ఆ తంతు పూర్తి అయ్యింది.అయితే…ఏపీలో ఏర్పాటు చేస్తున్నహైకోర్టులో మౌలిక వసతుల కల్పన పూర్తయ్యే వరకు హైకోర్టు విభజనను వాయిదా వేయాలని న్యాయవాదులు తమ పిటిషన్లో ధర్మాసనాన్ని అభ్యర్థించారు.
హైకోర్టు భవనాలు, జడ్జిల నివాస సముదాయాలు పూర్తి కాలేదని, అప్పటి వరకు సమయం ఇవ్వాలని కోరారు.అయితే పిటిషనర్లు వాదనలతో అత్యున్నత ధర్మాసనం ఏకీభవించలేదు.జస్టిస్ ఏకే సిక్రీ, అబ్దుల్ నజీర్తో కూడిన ధర్మాసనం.
ఈ సమయంలో హైకోర్టు విభజనలో జోక్యం చేసుకోలేమని పిటిషన్ ని కొట్టిసింది.