కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా నిర్వహించాల్సిందే అంటూ గత వారం ఒక పిటీషన్ను విచారించిన సందర్బంగా సుప్రీం కోర్టు కేంద్రంకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెల్సిందే.అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని సవరించింది.
సుప్రీం కోర్టు తాజాగా తన నిర్ణయాన్ని సరిదిద్దుకుంటున్నట్లుగా ప్రకటించింది.కరోనా వైరస్ టెస్టు కేవలం పేదవారికి మాత్రమే ఉచితంగా చేయాలని, అందరికి ఉచితంగా చేయాల్సిన అవసరం లేదంటూ పేర్కొంది.
ఈ సమయంలో ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది.కనుక డబ్బు ఉన్న వారికి ఈ పరీక్షలు ఉచితంగా చేయాల్సిన అవసరం లేదని, డబ్బులు వసూళ్ళు చేయవచ్చు అంటూ ప్రభుత్వంకు సూచించింది.
ఆర్థిక పరమైన ఇబ్బందులున్న ఈ సమయంలో కరోనా వైరస్ నిర్ధారణకు ప్రభుత్వాలు వందల కోట్లను ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తున్న కారణంగా సుప్రీం కోర్టు ఈ నిర్ణయంను వెళ్లడి చేసినట్లుగా సమాచారం అందుతోంది.సుప్రీం తీర్పును ప్రభుత్వ వర్గాల వారు ఇంకా ప్రముఖులు సమర్ధిస్తున్నారు.
ఆరోగ్య భద్రత కార్డు లేదంటే మరేదైనా ప్రభుత్వం దిగువమద్యతరగతి వారు అంటూ గుర్తించిన కార్డులు ఉన్న వారికి ఈ పరీక్షలు ఉచితంగా చేయబోతున్నారు.