నేడు సమాజంలో మహిళల పై అత్యాచారాలు ఎక్కువగా అవుతున్న విషయం తెలిసిందే.అయితే ఇలాగే స్కూల్ విద్యార్థిని రేప్ చేసిన ఒక ప్రబుద్దుడికి సుప్రీంకోర్టు చెమటలు పట్టించింది.
ఆ వివరాలు తెలుసుకుంటే.మహారాష్ట్ర విద్యుత్తు శాఖకు చెందిన ఉద్యోగి, మోహిత్ సుభాష్ చవాన్ తన మీద నమోదు అయిన రేప్ కేసులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా ఈరోజు సుప్రీం కోర్టులో, సీజే ఎస్ఏ బోబ్డే, ఈ కేసు విచారణ సందర్భంగా తీర్పునిస్తూ, అత్యాచారం చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే ఈ కేసులో మీకూ హెల్ప్ చేస్తాం, లేదంటే నువ్వు నీ ఉద్యోగం కోల్పోవడమే కాదు, జైలు శిక్ష కూడా అనుభవించవలసి వస్తుందని తీవ్రంగా మందలించారు.దీనికి మోహిత్ సుభాష్ సమాధానంగా తనకు మరో పెళ్లి జరిగిందని, అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేనన్నాడట.
ఇక నువ్వు ఒక గవర్నమెంట్ ఉద్యోగి అన్న ధ్యాస కూడా లేకుండా స్కూల్ విద్యార్థిని రేప్ చేసిన నీకు శిక్ష తప్పక పడవలసిందే అని జడ్జి అనడంతో, అరెస్టుకు గురైతే, తన ఉద్యోగం పోతుందని ఆ నిందితుడు కోర్టుకు తెలిపారు.కాగా నాలుగు వారాల వరకు ఈ అరెస్టును నిలిపివేస్తున్నామని, సరైన నిర్ణయం తీసుకోవాలని సీజే తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఇకపోతే రేప్కు గురైన అమ్మాయిని తొలుత నిందితుడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడట, కానీ అప్పుడు ఆమె నిరాకరించడంతో కధ ఇంతవరకు వచ్చిందట.