పాకిస్థాన్ నుంచి భారత్ లోకి డ్రోన్లతో నిషేధిత డ్రగ్స్ తో పాటు ఆయుధాలను సరఫరా అవుతున్నట్లు అధికారుల గుర్తించారు.పంజాబ్ లోని ఫజిల్కా జిల్లా చురివాలా చుస్తీలో డ్రోన్ ద్వారా డ్రగ్స్, ఆయుధాలు తరలించారు.ఈ క్రమంలో డ్రోన్ జారవిడిచిన మూడు ప్యాకెట్లను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.7.5 కిలోల హెరాయిన్, పిస్టల్, 2 మ్యాగజైన్లతో పాటు 9 ఎంఎం పిస్టల్ కు చెందిన 50 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.ప్యాకెట్లను జారవిడిచి డ్రోన్ పాక్ భూభాగం వైపు వెళ్లినట్లు సమాచారం.
తాజా వార్తలు